Sunday, February 14, 2010

ఘంటసాల గాన రాగ యాగం

పద్మశ్రీ ఘంటసాల అభిమానులకు అరుదైన అవకాశం.వంశీ ఆర్ట్ థియేటర్స్ సాంస్కృతిక సేవా సంస్థ అధ్వర్యంలో హైదరాబాద్ లోని త్యాగరాయగాన సభా సదనంలో "ఘంటసాల ఆరాధనోత్సవాలు" పేరుతో "ఘంటసాల గాన రాగ యాగం " 11-2-2010 నాడు ప్రారంభమయింది.ఈ యాగం 2-4-2010 వరకు అంటే 51 రొజులు కొనసాగుతుంది.ప్రతిరోజూ ఘంటసాల గారి పాటలను ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల పాటలు పాడుతున్న గాయనీ,గాయకులు మరియు తెలుగు చలనచిత్రసీమలో ఉన్న ప్రముఖ గాయనీ,గాయకులు ఆలపిస్తారనినిర్వాహకులు తెలిపారు.పండుగ వాతావరణంలో 51 రోజుల పాటు ఘంటసాల అభిమానులను అలరించబోతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల గారి గాన గంగలో తడిసిముద్దవ్వండి.ఘంటసాల పై మీ అభిప్రాయాల్ని మీ బ్లాగ్గుల్లో పంచుకోండి.