Monday, June 7, 2010

మగధీర విజయరహస్యం

చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ బ్లాగు లోకానికి అడుగుపెట్టాను.కారణాలనేకమైనా ఈ రెండు నెలలుగా జరిగిన ఎన్నో సంఘటనలు మీతో పంచుకొవాలి.ముఖ్యంగా కౌముది మాస పత్రిక అమూలాగ్రం చదవాను.నిజంగానన్నో లోకంలోకి తీసుకెళ్ళింది."మొదటి సినిమా" శీర్షిక వర్ఠమాన రచయితల జీవన పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రచన.ఇది ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకం. ఇక యండమూరి వీరేంద్రనాథ్ గారి "పాపులర్ రచయిత అవడం ఎలా? " మరో అద్బుత పుస్తకం.రచయితగ ఎదగాలనికునే ప్రతి ఒక్కరు చదవాల్సిన కాదు కాదు అచరించాల్సిన గొప్ప పుస్తకమది.".. ఇక్కడ మీకో ముఖ్యవిషయం చెప్పదలచుకున్నాను.యండమూరి వీరేంద్రనాథ్ గారు నవలను ఎలా ప్రారంభించాలని చెబుతూ ఇలా అన్నారు."నవల ప్రారంభించబోయే ముందు మనం మెదటి నాలుగు పేజీల్లోనే పాఠకుల్ని మూడ్ లోకి తీసుకెళ్ళాలి. మొదటి అధ్యాయం పూర్తయ్యేసరికల్లా పాఠకుడిని పుస్తకం వదిలిపట్టలేనంత మూడ్ లోకి తీసుకెళ్ళగలిగితే సాధారణంగా ఆ నవల క్లిక్ కాకపొవటం అంటూ జరగదు.నవలా ప్రారంభంలోనే ఏదో ఒక నాటకీయ సంఘటనని సృష్టించటం ఎప్పుడూ పాపులర్ నవలకు మంచిదే.తీసుకున్న థీం ఏదైనా ప్రారంభం మాత్రం అకట్టుకునేలా ఉండాలి."ఇంతకీ ఈ విషయం ఎందుకు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఈ వాక్యాలు చదివిన తర్వాత "మగధీర" చిత్రం గుర్తొచ్చింది.ఆ చిత్రం అంతగా విజయవంతం కావటానికి కారణం ఏమిటని ఎందరినో అడిగాను.చాలమంది గ్రాఫిక్స్ అంటే ,పాటలని కొందరు,ఆర్ట్ అని కొందరు,ఫైట్స్ అని కొందరు,కాజల్ అందమని కొందరు,పబ్లిసిటీ అని కొందరు, పైవన్నీ అని కొందరు అన్నారు. కాని నాకనిపించిది ఇవ్వన్నీ కాదు.చిత్రప్రారంభంలోని మెదటి సీను. మిత్రవింద,కాలభైరవలు భైరవకొన పైనుంచి గాల్లో తేలిపోతూపడిపొవటం ఎవరో మిత్రుడు అన్నట్టు "రాజమౌళి ఈ స్టోరీకి మూలం ఏమిటనే పాయింట్ తో కథ మొదలుపెట్టడం ద్వారా ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించగలిగారు"దాన్ని చిత్రం చివరిదాక కొనసాగించగలిగాడు.దీనికి పాటలు,కళ,స్టైల్ ,అదనపు అకర్షణలు వెరసి తెలుగు చిత్రసీమలో అద్బుత విజయం ఆవిష్కృతమైంది.హాలివుడ్ చిత్రాల్లో ఈ తరహా చిత్రణ కనిపిస్తుంటుంది.నాకైతే నవలలు చదవటం అలవాటు లేదు కాని "దిరిసెన పుష్పాలు" బ్లాగు రచయిత్రి గారు కొద్దిగా ఇలాంటి ప్రారంభాన్ని ఇవ్వగలుగుత్తున్నా చివరి దాకా కొనసాగించటంలో ఏదో వెలితి కనిపిస్తుంది.ఇక ఏ బ్లాగర్లు కూడా తమ టపాల్లో ఈరకమైన ఆసక్తి కలిగించే ప్రారంభానిచ్చి చివరికంటా కొనసాగించాలన్న తపన కనిపించకపోవటం పెద్ద లోటే.బ్లాగరు మహాశయులారా,సాయితీప్రియులు,రచయితలు ఒక్కసారి ఈ విషయం ఆలోచించండి.