Sunday, January 31, 2010

"ఆరు బంగారు సూత్రాలు"

భార్య,భర్తల మధ్య,కుటుంబసభ్యుల మధ్య ,బిజినెస్ పార్టనర్స్ మద్య వివాదాల తలెత్తినప్పుడు,ఏ రెండు అక్షరాల మాట అద్భుతాలను చేయగలదో తెలుసుకొవాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం డా .బి.వి.పట్టాభిరాం గారు వ్రాసిన "కమ్యూనికేషన్స్ మీ విజయానికి పునాది".ఈ పుస్తకంలో "సంభాషణ ఎలా ప్రారంభించాలి?ఏమిటి?ఎప్పుడు?ఎందుకు?ఎవరు?ఎక్కడ?ఎలా మాట్లాడాలి? వంటి విషయాలు ,ఎలా మాట్లాడకూడదు? ఆసెర్టివ్ వంటి విషయాలు ప్రాక్టికల్ గా చర్చించారు.ఈ పుస్తకంలొ "ఆరు బంగారు సూత్రాలు" అనే విభాగం నాకు బాగా నచ్చింది.సంభాషణ ప్రారభించేటప్పుడు గరాటు పద్దతి నాకు నచ్చిన మరో అంశం.ప్రతి ఒక్కరు చదవాల్సిన ఒక మంచి పుస్తకాన్ని అందించిన రచయితకు క్రుతజ్ఞతలు.

మనిషికి వాక్ అభరణమే కాదు రక్ష

నా చిన్నప్పటినుంచి నాకు తెలిసిన విషయం ఇది." కె యూన న విభూషయంతి పురుషాం,హారాన చందోజ్జ్వలన్,న స్నానం నవిలెపనం న కూసుమం నా లంకృతా మూర్దజా,వాన్యెకా సమలంకకరొతి పురుషాం యా సంస్కృతా ధార్యతే,క్షీయంతే ఖలు భుషణాని సతతం ,వాక్ భూషణం భూషణం".దీనర్ఠం. మనిషికి ఏది అభరణము.స్నానం,సుగంధద్రవ్యాలు,పువ్వులు,నగలు,శిరోలంకరణ ఇవి ఏవియు ఒక పురుషునికి అభరణములు కావు.యెందువలనంటే శరీరము.నశ్వరమైనది.మనిషికి వాక్ అభరణము.నెను ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావించవలసివచ్చింది అంటె ఈరొజు నేను వాక్ అభరణమే కాదు రక్ష అన్న విషయం తెలుసుకున్నాను.

మాట మంత్రమా?

మీరు మీ మాటల్తో ఎదుటి వారిలో ప్రేరణ కలిగించాలనుకొంటున్నారా? వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి,పదును పెట్టి,నైపుణ్యం కల వారుగ తీర్చిదిద్దటానికి ఏది ఉపయోగపదుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?అయితే మీరు డాబి.వి.పట్టాభిరాం రచించిన "మాటే మంత్రము" పుస్తకాన్ని చదవాల్సిందే.
వారు ఈ పుస్తకంలో మాటలు మంత్రాల్లాగ ఏ విధంగా పని చేస్తాయి? కమ్యూనికేషన్ "9సి" టెక్నిక్స్,కమ్యూనికేషన్ పద్దతులు,బాడీ లాంగ్వేజి,పబ్లిక్ స్పీకింగ్ యెలా?,టెలిఫోన్ మానర్స్,వినడం,Transactional Analysis,కమ్యూనికేషన్ స్థితులు,కమ్యూనికేషన్ గాప్,ఎమోషనల్ ఇంటలిజెన్స్ గురుంచి ప్రాక్టికల్ గా వివరించారు.ఈ పుస్తకంలో "నేను క్షెమం ,మీరు క్షెమం " అన్న విభాగంలోని కమ్యూనికేషన్ లోని మూడు స్థితుల కు సంబందించిన అంశం బాగా నచ్చింది.ప్రత్యేకించి కమ్యూనికేషన్ గాప్ వల్ల వచ్చె అనర్థాలను వివరిస్తూ పోలీసు శాఖలోని ఒక సంఘటన ద్వారా వివరించిన తీరు బాగా నచ్చింది.సరళమైన పదాలతో ,చక్కని బొమ్మలతో,మంచి ఉదహరణలతో తేలికగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని రూపొందిచినందులకు రచయుతకు దన్యవదాలు.

Thursday, January 28, 2010

"వేల పాటల నిధి" వేటూరికి వెనవేల నమస్కారాలు

ఆత్త్రేయ,ఆరుద్ర,శ్రీ శ్రీ లాంటి మహా రచయితల రచనా ప్రవాహాన్ని తట్టుకొని తనదైన ఒక నూతన ఒరవడిని స్ర్ర్షుష్టించిన వేటూరికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన వ్రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపదుతుంది.పల్లె పదాల అందాలు కళ్లకు కట్టినట్లుగ కనబదతాయి.జనపదాల సొయగాలు హొయలు పోతాయి.నీలి నీలి ఊసులు చెవుల్లో వినిపిస్తాయి.సాంప్రదాయ సంగీత కీర్తనలు,సంస్క్రత పదాలు సామాన్యులను అలరించలేవు అన్న వాదాన్ని "శంకరాభరణం" లో తన పాటల ద్వారా తప్పని నిరూపించారు."సిరి సిరి మువ్వలో" వారు వ్రాసిన"ఝుమ్మంది నాదం ,సై అంది పాదం,తనువూగింది ఈ వేళా, చెలరేగింది ఒక రాసలీల" అనే పల్లవి ఆయన వ్రాసిన ప్రతిపాట విన్నప్పుడు కలిగే అనుభూతి."ఆందంగా లెన ,అసలేం బాలెన,నీ ఈడు జోడు కానన,అలుసైపోయాన,అసలేమి కానన,వెషాలు చాలన" అని ప్రియుడి కోసం తపించే ప్రియురాలి తపన చెప్తూనే "మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే,అతనికి నువ్వునచ్చావో లేదొ, ఆ షుభ గడియ వచ్చేనొ రాదొ" అని హెచ్చరించినా వారికే చెల్లు.నవ్వింది మల్లె చండు ,"నచ్చింది గర్ల్ ఫ్రెండు ,దొరికనే మజగా చాన్సు ,జరుపుకో భలే రొమన్సు,యురెకా తకమిక,నీముద్దు తీరె దాక "అని ప్రియురాలి ప్రేమను పొందిన అనందాన్ని"స్నేహితుడా స్నేహితుడా,రహస్య స్నేహితుడా,చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా " అని ప్రియున్ని తలుచికునే ప్రియురాలి అలోచనలు మనకు అందిచింది ఆయనే."నవమి నాటి వెన్నల నెను,దశమి నాటి జాబిలి నెను,కలుసుకున్న ప్రతిరెయి,కార్తీక పున్నమి రెయు""మానసవీణ మదు గీతం,మన సంసారం సంగీతం' అని సంసారంలొని సరిగమల్ని పలికిచింది అయనే ."క్రుషి ఉంటే మనుషులు ఋషులౌతారు,మహాపురుషులౌతరు,తరతరాలకు వెలుగౌతారు,ఇలవెల్పులౌతరు" అని తట్టిలేపింది వారె."ఆకు చాటు పింద తడిసె,కొమ్మ చాటు పువ్వు తడిసె" అని కొంటె తనాన్ని నేర్పింది ఆయనే."ఏ కులము నీ దంటే ,గొకులము నవ్వింది,మాధవుడు,యాదవుడు మాకులము పొమ్మంది." అని కులాలు లేవు అని చెప్పందీ వారె."పుణ్యము పాపము ఎరుగని నేను,పూజలు సేవలు ఎరుగని నెను,ఏ పూలు తేవాలి నీపూజకు,ఏ లీల సేయలి నీ సెవలొ,శివ శివ శంకర భక్తవ శంకర ,శంభో హర హర నమో నమో" అని ఒక అమాయక కొయదొర భక్తిని "ఓంకర నాదాలు సందానమౌ రాగమే శంకరాభరణము " అని పండితుడి భక్తిని చెప్పింది ఆయేనె."ఛినుకులా రాలి నదులుగా సాగి,వరదలై పొంగి,హిమములై రాలి,సుమములై పూసె,నీప్రేమ నా ప్రేమ" అంటూ ప్రేమ ప్రవాహంలో ప్రయణింపచేసింది వారే."నిన్నటి దాక శిలనైనా ,నీ పదము సొకినే గౌతమి నైన" అని అన్నా,అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ ,అందరికీ అందనిదీ పూసిన కొమ్మ "అని ఒక సహజమైన పదాలతో అలరించిది వారె."ఆమని పాడవె హాయిగా,మూగవై పొకు ఈ వేళ," అని "అకాశానసూర్యుడుండడు సంధ్యవెళకే,చందమామకి రూపముండదు తెల్లవారితే,ఈ మజిలీ మూడునాళ్ళు ఈ జీవ యాత్రలో,ఒక ఒపూటలొనా రాలు పువ్వులెన్నో,నవ్వవే నవ మల్లిక ,ఆశలే అందలుగ " అంటూ ధైర్యాన్నిచ్చింది వారె."వెణువై వచ్చాను భువనానికి,గాలినై పోతాను గగనానికి ,మాటలన్నీ మౌనరాగం వాంచలన్నీ వాయులీనం " అని చెప్పిన అయనే "అకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమావిరహమో గానమో ,వినిపించు నా చెలికి మేఘసందేశం" అని అయనే అన్నారు .బహుశా వారు వ్రాసిన ప్రతి పాట మేఘసందేశమనే యేమో.

Friday, January 15, 2010

సంక్రాతి శుభాకాంక్షలతో నా ఈ నూతన ప్రపంచానికి స్వాగతం.గత సంవత్సరం నేను చేయవలసిన పనుల గురుంచి అలోచిస్తూ పత్రికలకి వ్యాసాలు వ్రాయలని అనుకున్నాను.కాని నా ఆ కోరిక అనేక కారనాలవలన తీరలేదు.కాని ఇప్పుదు ఈ విధంగ నా సొంత బ్లాగు ద్వారా ఆ కోరిక తీరబొతున్నందులకు యెంతో అనందంగ ఉన్నది.