Monday, March 29, 2010

హైదరాబాద్ జిందాబాద్

మత సామరస్యానికి ప్రతీక,గంగ యమునల సంగమం అని చెప్పుకునే సంస్కృతికి చిహ్నం హైదరాబాద్ మరొక్కసారి కర్ఫ్యూ నీడన చిక్కుకొంది.గత రెండు రోజులుగ జరిగిన చెదురుమొదురు సంఘటనలు తారాస్టాయికి చేరటంతో ఫాతబస్తీలో నిరవధిక కర్ఫ్యూ విధించటం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది।మరో వైపు ఈ సున్నిత పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పాల్సిన రాజకీయ పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటూ వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తున్నారు.ఇక మీడియా మతసామర్యాన్ని పెంచే విషయాలను అటుంచి ఈ అల్లర్ల వెనుక "రాజకీయ కుట్రకోణాన్ని" తీవ్రంగా పరిషోధిస్తూ గంటలకొద్ది చర్చల్ని ప్రచారం చెస్తోంది.ఇక మరో వైపు కొంతమంది ఈ అల్లర్ల వెనుక ప్రభుత్వ పతనానికి అధికార పక్షం లోని ఓ వర్గం ప్రయత్నమని ప్రచారం చేసేపనిలో పూర్తిగ నిమగ్నమైంది.మరో వైపు, పాతనగరంలో ప్రాబల్యం ఉన్న ఒక రాజకీయపార్టీ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ అల్లర్లను సృష్టిస్తోందంటూ మిగతా రాజకీయ పక్షాలన్నీ విమర్శి స్తుండగా,ఆ రాజకీయ పక్షం మాత్రం మెజారిటి మతానికి చెందిన కొన్ని సంస్ఠల కుట్రగా ప్రతివిమర్శ చెస్తోంది.ఇక ఒక ఉద్యమ పార్టీ నాయకుడు ఒక చర్చలో మాట్లాడుతూ పోలిసు అధికారులందరు వలస ప్రాంతానికి చెందినవారు కావటం మూలాన పరిస్ఠితి చెయ్యిదాటిపోయిందని సూత్రీకరించారు.ఇలా విమర్స,ప్రతివిమర్శలతో ఊదరగొట్టడమేగాని కర్ఫ్యూ లో చిక్కుకొని అల్లాడుతున్న సామాన్యుని బ్రతుకుల గురుంచి గాని,రెక్కాడితే గాని డొక్కాడని దీనుల బ్రతుకుల రక్షణ గురుంచిగాని ఎవ్వరికి ఇసుమింతైనా సానుభూతి లేదు.ఇలా తమ స్వార్థ ప్రయోజనాలకోసం యెవరికి తొచినట్టు వారు ఈ సమస్యను మలచుకునే పనిలో ఉన్నారే గాని కలిసికట్టుగా ఆ ముష్కర మూకలను తరిమికొట్టడానికి ప్రజలందరిని సంఘటితపరచాలన్న ఆలొచన ఏమాత్రం కనిపించటలేదు।వారెన్ని రకాలుగా ప్రయత్నించినా హైదరాబాద్ లోని వివిధ మతాల ,భాషల ,ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న అనుభందాన్ని విడదీయలేరు.దేశ,విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలారా ఒక్కసారి అనండి "హైదరాబాద్ జిందాబాద్"

No comments: